రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, డిసెంబర్ 2016, గురువారం

రివ్యూ!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : విద్యాబాలన్,అర్జున్ రాంపాల్, నైషా సింగ్, టునీషా శర్మ, అంబా సన్యాల్, మానినీ చద్దా, ఖరజ్ ముఖర్జీ, జుగల్ హన్స్ రాజ్ తదితరులు
కథ : సుజోయ్ ఘోష్, సురేష్ నాయర్, మాటలు : రీతేష్ షా
సంగీతం : క్లింటన్ సెరెజో, చాయాగ్రహణం : తపన్ బోస్
బ్యానర్ : బౌండ్ స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సుజోయ్ ఘోష్, జయంతీలాల్ గడా
విడుదల :  2డిసెంబర్ 2016
***
          2012 కహానీకి సీక్వెల్ గా చెప్పుకుంటూ విడుదలైన కహానీ -2’ నిజానికి కొనసాగింపు కథేమీ కాదు, పాత్రలూ వేరు. కథ, పాత్రలు వేరైనప్పుడు సీక్వెల్ అనలేం. అయితే  దర్శకుడు సుజయ్ ఘోష్ దీనికింకో విధంగా చెప్పాడు- ‘కహానీఅనేదాన్ని  ఒక ప్రత్యేక  జానర్ కి పర్యాయపదంగా తీసుకోవాలని. స్త్రీని శక్తివంతంగా చూపించే జానర్ ని  కహానీఅనాలని. కాబట్టి  ఇకనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని కహానీ సినిమాలుఅనాలేమో. కానీ కహానీల్నిక్రైం ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ సుజయ్- విద్యా బాలన్ ద్వయం తప్ప ఇంకెవరూ తీయలేరనేంత  గట్టి ముద్ర వేసి వదుల్తున్నారు- మొదటి కహానీఎంత పవర్ ఫుల్లో, ఇప్పుడు రెండో కహానీ’  అంతకంటే పవర్ఫుల్ ! మధ్యలో వచ్చిన అనిరుథ్ రాయ్ చౌధురి- తాప్సీల పింక్లాంటివి అరుదుగా వస్తాయి. శక్తివంతమైన స్త్రీని చూపించడ మంటే ఇక్కడ ఏ ఉద్యమనాయకురాల్నో చూపించడం కాదు- నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని హీరోయిన్  పాత్ర చుట్టూ సస్పెన్స్  థ్రిల్లర్స్ గా చేసి చూపించడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని నేటి యూత్ ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చి వినోదపర్చడం...సొమ్ము చేసుకోవడం... 

         
దివరకు చెప్పుకున్నట్టు బాలీవుడ్ లో బస చేసిన బెంగాలీ దర్శకులు విలక్షణమైన సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే పింక్తర్వాత ఇప్పుడు కహానీ -2 అంతటి కళ్ళు తిప్పుకోనివ్వని పకడ్బందీ థ్రిల్లర్. సినిమా చూస్తూ రివ్యూ రైటర్ మెమోలో ఏదైనా పాయింటు ఫీడ్ చేసుకోవాలన్నా ఏకాగ్రత దెబ్బతినేసేంత బిగిసడలని కథాకథనాల క్రియేటివ్ ప్రాసెస్ ఇది. ఒక విద్యాబాలన్ కోమాలో కెళ్ళిపోయి, ఇంకో విద్యాబాలన్  హేండాఫ్ క్యారక్టర్లా యాక్షన్లో కొచ్చి  కుతకుతలాడే కసినంతా తీర్చుకునే విలాసవంతమైన క్వాలిటీ మూవీ...

కథ 
      విద్యా సిన్హా (విద్యా బాలన్) ఒక ఉద్యోగం చేసుకుంటూ పధ్నాల్గేళ్ళ  కూతురు మిన్నీ (టునీషా శర్మ) ని పోషించుకుంటూ వుంటుంది. కాళ్ళు పడిపోయిన కూతురు చక్రాల కుర్చీకీ, మంచానికీ బందీ అయిపోయి వుంటుంది. ఉంటున్నది కలకత్తా దగ్గరలో చందాపూర్ అనే చిన్న టౌన్లో. కూతురికి వైద్యం అమెరికాలో సాధ్యపడుతుందని డాక్టర్ అంటే  అమెరికా తీసికెళ్ళే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంతలో కూతుర్ని కిడ్నాప్ చేశామని కాల్ వస్తుంది. విద్యాసిన్హా ఆదరాబాదరా పరిగెడుతూ యాక్సిడెంట్ పాలయ్యి కోమాలో కెళ్ళిపోతుంది. సబిన్స్ పెక్టర్ ఇందర్జిత్ సింగ్ (అర్జున్ రాంపాల్) రంగంలో కొస్తాడు. కోమాలో వున్న విద్యా సిన్హాని చూడగానే షాకవుతాడు. డాక్టర్ ఆమె ఐడీ చూపించి, ఈమె విద్యా సిన్హే అంటాడు. కాదు ఈమె కలింపాంగ్ లో వుండాల్సిన దుర్గా రాణీ  సింగ్ అని ఇందర్జిత్  సింగ్ ఆమె ఇంటికెళ్ళిపోయి  సోదా చేస్తాడు. ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతూంటే దిమ్మదిరిగిపోతుంది...

      తర్వాత పైఅధికారి ఇందర్జిత్ కి ఒక హేండ్ బిల్ అందించిఈ వాంటెడ్ కిల్లర్ ని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. ఆ ఫోటో చూస్తే దుర్గా రాణీ సింగ్ దే. కలింపాంగ్ లో ఎనిమిదేళ్ళ క్రితం ఒక మర్డర్ చేసి, ఇంకో కిడ్నాప్ చేసి పారిపోయిన దుర్గా రాణీ సింగ్ ని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందంటాడు పై అధికారి. ఒకవైపు కోమాలో వున్న విద్యాసిన్హా, ఇంకో వైపు చేతిలో దుర్గా రాణీ సింగ్ గురించిన డైరీ...ఇందర్జిత్ కి బుర్ర వేడెక్కిపోతుంది.

        అసలు విద్యా సిన్హాగా పేరు మార్చుకున్న దుర్గా రాణీ సింగ్ ఎవరు? ఆమె ఎందుకు ఎవర్ని మర్డర్ చేసి, ఎవర్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు కిడ్నాపైన కూతురు ఎక్కడుంది? ఎవరు ఎందుకు కూతుర్ని కిడ్నాప్ చేశారు? కోమాలో వున్న విద్యా సిన్హా కి మాత్రమే  తెలిసిన ఈ కూతురి కిడ్నాప్ గురించి ఇందర్జిత్ సింగ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? విద్యాసిన్హా కోమాలోంచి మేల్కొంటుందా లేదా? ఈలోగా ఇందర్జిత్ సింగ్ పై అధికారినుంచి విషయాలు దాస్తూ ఏం పాట్లు పడ్డాడు? అసలెందుకు విషయాలు దాస్తున్నాడుపెళ్ళయిన ఇతడికి దుర్గా రాణీ సింగ్ తో వున్న సంబంధమేమిటి? ఈ సంబంధం బయటపడితే పీక్కునే దేంటి?....ఇన్ని చిక్కు ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటో తెరపైనే చూడాలి.

ఎలావుంది కథ 
      ఈ పైకి కన్పిస్తున్నదంతా కథ కాదు. ఇదంతా ఇంకో కథకి కథ. 2014 లో ఆలియా భట్- రణదీప్ హుడా లతో ఇంతియాజ్ అలీ తీసిన హైవేలో చివర బయట పడే కథే, ‘కహానీ -2’  లో మందు
పాతరలా మధ్యలో పేల్తుంది. కాకపోతే హైవేలో అది హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అనుభవమైతే, ‘కహానీ -2’ లో బాల పాత్ర మిన్నీ వ్యధ. ఎక్కడో ఓ చోట, ఇళ్ళల్లో  చిన్న పిల్లలతో  పాల్పడుతున్న చైల్డ్ ఎబ్యూజ్ అనేది ఎవ్విరీ డే న్యూజ్ లాగా మారిపోయిన ప్రస్తుత కాలంలో, అందులోంచి తనకేమీ కాని ఆరేళ్ళ ఓ పిల్లని కాపాడేందుకు ఓ సాధారణ స్కూలు ఉద్యోగిని తెగించి ఏమేం చేసిందన్నది, ఈ క్రమంలో ఏమేం కోల్పోయిందన్నదీ అసలు కథ. నిత్యజీవితంలో సమస్యల్ని ఇంకా ప్రేక్షకుల్ని ఏడ్పిస్తే డబ్బులొస్తాయనే రొడ్డకొట్టుడు ఏడ్పు కథగా కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ గా చేసి చూపిస్తూఓ సరికొత్త వీక్షణానుభవాన్నిచ్చే వుమన్ ఎంపవర్ మెంట్ కథ.

ఎవరెలా చేశారు
     విద్యాబాలన్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిందేముటుంది. సరైన పాత్ర ఇస్తే దాని దుంపతెంచుతుంది. మేకప్ కూడా అవసరం లేకుండా నటించి పారేస్తుంది. గ్లామర్ కోసం పాత్ర లబోదిబోమన్నా చెప్పినట్టు పడుండమంటుంది. ఫ్రీ స్టయిల్ నటన ఆమెది. రెండు పాత్రలతోనూ  సస్పెన్స్ థ్రిల్లర్ ని హై వోల్టేజ్ డ్రామాలాగా మార్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ( దుర్గా రాణీ సింగ్)కి వ్యతిరేకంగా సంపన్నుల కుటుంబం, స్కూలు యాజమాన్యం, లేడీ కానిస్టేబుల్ చేసే అన్యాయాలకి తనదైన వ్యూహరచనా సామర్ధ్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మళ్ళీ ప్రస్తుత  విద్యాసిన్హా పాత్రలో వాంటెడ్ కిల్లర్ గా చందా నగర్ నుంచీ కలకత్తా దాకా పోలీసుల్ని కిందామీదా చేసేస్తుంది. మిన్నీని అమెరికా తీసికెళ్ళే తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు- ఆపితే అయిపోయారన్నట్టే ఒక్కొక్కళ్ళూ. ఆమెని కిల్లర్ గా భావించుకునే మనుషులేగానీ, ఆమె తల్లికాని తల్లి  మనసుని కూడా ఎవరూ పట్టించుకోని విషాదం పాత్రచుట్టూ వుంటుంది. స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారో లేదో గానీ, ఒక స్కూలు క్లర్క్ గా, పెళ్ళికాని దుర్గా రాణి ఎందుకు ఒక స్కూలు బాలిక కోసం సింగిల్ మదర్ గా జీవితాన్ని డిసైడ్ చేసుకుందన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆమె కథే సమాధానం. విద్యాబాలన్ వి ఈ రెండూ ఆదర్శ పాత్రలు

    సబిన్స్ పెక్టర్ గా అర్జున్ రాం పాల్ ది కూడా చాలాసహజ  పాత్ర
కాస్త ఏమీ పట్టని తత్త్వంతను వస్తూంటే కానిస్టేబుల్ కూర్చుని వున్నా పెద్దగా పట్టించు
కోడు
ఎంక్వైరీ కెళ్ళినప్పుడు పేపరు చదువుకుంటున్న  ఒకడ్ని అడ్రసు అడిగితే,  వాడు పేపరు పేపరు చదువుకోవడమే తప్ప తనని పట్టించుకోకపోయినా-  ఏం చేస్తాం..అనుకుంటూ వెళ్ళిపోయే రకం  అర్జున్ రాం పాల్ సబిన్స్ పెక్టర్ పాత్ర.  కోపమనేదే వుండదుఇదే బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కహానీ’ లో కూడా పోలీసు పాత్రలు ఇలాటి  డిఫరెంట్ ఫీల్ నే ఇస్తాయిఅర్జున్ రాం పాల్ లాగే  పై అధికారి పాత్రలో ఖరజ్ ముఖర్జీ ఆసక్తికర పాత్ర పోషించాడు.

        మిన్నీగా ఆరేళ్ళ బాలికగా నైషా ఖన్నా నటిస్తేపధ్నాల్గేళ్ళ బాలికగా టునీషా శర్మ నటించిందిఇద్దరూ లైంగికంగా తనకేం జరుగుతోందో తెలీని పసితనపు  మిన్నీ అంతరంగాన్ని సున్నితంగా ఆవిష్కరించారుమిన్నీ నానమ్మ పాత్రలో అంబా సన్యాల్ ది టెర్రిఫిక్ నటనఆమె కొడుకు పాత్రలో జుగల్ హన్స్ రాజ్లేడీ కానిస్టేబుల్ పాత్రలో మానినీ  చద్దా మరో రెండు నెగెటివ్ పాత్రలు పోషించారు.  

      నటనలకినటింప జేయడాలకీ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లా వుంటుంది దర్శకుడి ప్రతిభక్లింటన్ సెరేజో సంగీతం లోని మూడు బ్యాక్ గ్రౌండ్ పాటల్లో లమ్హోకే రస్ గుల్లే’ ( రసగుల్లా ల్లాంటి క్షణాలుపాట టాప్తపన్ బసు ఛాయాగ్రహణం రియల్ లోకేషన్స్ లోముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో ఓ కళాత్మక చిత్రణసబ్ కాన్షస్ గా ప్రేక్షకుల్ని సన్నివేశాల్లో సంలీనం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వెలిగే వర్ణ కాంతులతో ఒక అద్భుత ప్రయోగం చేశారురోడ్ల మీద పసుపు పచ్చ కాంతి ప్రసరింపజేయడం కూడా అందులో ఒకటి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో వివిధ రూపకాలంకారాల్ని వాడినట్టు ఇక్కడ వర్ణకాంతుల్ని ఉపయోగించారుసినిమాకి ఛాయాగ్రహణంతో కూడా చాలా పనుంటుందని ఇక్కడ నిరూపించారుకథ కాన్షస్ లెవెల్లో ప్రేక్షకులకి అందితేఇలాటి ఛాయాగ్రహణం లోతుగా సబ్ కాన్షస్ లెవెల్ కి తీసికెళ్తుందిఒక హిప్నాటిక్ లోకాన్ని సృష్టిస్తుందిబెంగాల్లోని చందా నగర్కలింపాంగ్కలకత్తా లొకేషన్స్  కాసేపు ఈ హిందీ సినిమాని కొత్త లోకాలకి తీసికెళ్తాయి.

చివరికేమిటి 
       మొదలెట్టింది లగాయత్తూ  ముగిసేదాకా ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రెండు మూడు సార్లు చూడొచ్చు. ప్రతి సీనూ, ప్రతీ షాటూ క్షణం క్షణం కథని ముందుకు పరిగెత్తించేవే తప్ప ఎక్కడా కథని ఆపి కాలక్షేపం కోసం లేవు. చాలా పూర్వం అగర్, ఔర్ కౌన్ లలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని గుర్తుకు తెచ్చేలా వుండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి కాలానికి హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. మొదటి పదినిమిషాల్లోపు పాత్రకి యాక్సిడెంట్ అయ్యే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసిమళ్ళీ చివర పదిహేను  నిమిషాల  ముందు పాత్ర కోమాలోంచి లేవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి- మధ్యలో అంతా  గత/ వర్తమాన కాలపు యాక్షన్స్ తో సంక్షుభితంగా వుంటుంది మిడిల్. నడుస్తున్న కథకి ఎలా స్పష్టమైన బిగినింగ్-మిడిల్-ఎండ్ లుంటాయో, అలా  గడిచిపోయిన కథకీ వుంటాయి. డైరీపేజీల్లోంచి వంతులవారీగా వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ గడిచినపోయిన కథ వుంటే, ప్రస్తుత కాలంలో కేసుతో పోలీసుల సంఘర్షణగా  వుంటుంది

        పకడ్బందీ రచన, పకడ్బందీ నటనలు ఎందుకు సాధ్యం కావు మనసుంటే- ఏదో నడిచిపోతుందని స్టార్ వేల్యూ మీద ఆధారడిపోయి చుట్టేస్తే అదొక సినిమా అన్పించుకుంటుందా? ప్రేక్షకులు దొంగ నోట్లు ఇవ్వడంలేదు దొంగ సినిమాలు చూపించడానికి- దొంగ సినిమాల మధ్య అప్పుడప్పుడు ఇలాటి దొర సినిమాలు వస్తున్నా, తేడా పసిగట్టలేని ప్రేక్షకులు వుంటున్నందువల్లే బరితెగించి దొంగ సినిమాలు వస్తూంటాయి.... ‘కహానీ -2’ దొరసాని సినిమా!


-సికిందర్
http://www.cinemabazaar.in